Advertisement

ధోని తర్వాతనే ఎవరైనా ..కమ్రాన్ అక్మల్

By: Sankar Sat, 13 June 2020 3:12 PM

ధోని తర్వాతనే ఎవరైనా ..కమ్రాన్ అక్మల్



ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌‌లో టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీ బరిలోకి దిగబోతున్నట్లు పాకిస్థాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ జోస్యం చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన ధోనీ.. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. దాంతో.. అతని కెరీర్ ఇక ముగిసిపోయిందని వార్తలు వస్తుండగా.. లెక్కకి మించి అతని రిటైర్మెంట్‌పై రూమర్స్ వినిపించాయి. కానీ.. ధోనీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

టీమిండియాకి ధోనీ దూరమవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి వరుసగా భారత సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఈ ఇద్దరిలో రిషబ్ పంత్ ఘోరంగా విఫలమవగా.. కేఎల్ రాహుల్ ఊహించని విధంగా వికెట్ కీపర్ / బ్యాట్స్‌మెన్‌గా సక్సెస్ అయ్యాడు. దాంతో.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో పంత్‌ని రిజర్వ్ బెంచ్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ పరిమితం చేసింది.


dhoni,wicket keeper,india,t20,world cup,kamran akmal ,ధోని , కమ్రాన్ అక్మల్ , టీమిండియా,  రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌


టీ20ల్లో ఇప్పటికే ఓపెనర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న కేఎల్ రాహుల్.. కీపర్‌గానూ రాణించడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో అతనికే అవకాశమివ్వాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దాంతో.. సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్‌ రేసులో మాత్రమే రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికీ టీమిండియాకి ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ ధోనీనేనని తాజాగా కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌గా ఎవరుంటారని మీరు ఊహిస్తున్నారు..?’’ అని కమ్రాన్ అక్మల్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘‘నా అంచనా ప్రకారం మహేంద్రసింగ్ ధోనీ. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ కేఎల్ రాహుల్’’ అని వెల్లడించాడు.

Tags :
|
|
|

Advertisement