Advertisement

  • సుశాంత్ వార్త వినగానే ధోనికి చాలా కోపం వచ్చింది ..నిర్మాత అరుణ్ పాండే

సుశాంత్ వార్త వినగానే ధోనికి చాలా కోపం వచ్చింది ..నిర్మాత అరుణ్ పాండే

By: Sankar Mon, 15 June 2020 3:34 PM

సుశాంత్ వార్త వినగానే ధోనికి చాలా కోపం వచ్చింది ..నిర్మాత అరుణ్ పాండే



హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురి అయింది ..కేవలం సినీ ప్రముఖులే కాకుండా , రాజకీయ , క్రీడా ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు ..మోడీ దగ్గరి నుంచి మొదలుపెడితే , సచిన్ , కోహ్లీ , రోహిత్ ఇలా అందరూ తమ బాధను తెలియజేసారు ..కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఇంతవరకు స్పందించలేదు ..అతడే టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ..సుశాంత్ అందరికంటే ధోనీకే ఎక్కువ ఆప్తుడు ..

ధోని లైఫ్ స్టోరీ తో తీసిన సినిమాతోనే సుశాంత్ స్టార్ అయ్యాడు ..ఆ సినిమాలో అచ్చు గుద్దినట్లు ధోనిని దింపేసాడు సుశాంత్ ..ఆ సినిమా కోసం అనేక రోజులు ధోనితో ట్రావెల్ చేసి ధోని ఎలా చేస్తాడో అన్ని దగ్గర ఉండి గమనించాడు ..ఇంత సాన్నిహిత్యం ఉన్న ధోని స్పందించకపోవడంపై అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు ..ధోనీ స్పందనపై చర్చ జరగడంతో అతని మేనేజర్, ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ నిర్మాత అరుణ్ పాండే స్పందించాడు. ‘‘సుశాంత్ సూసైడ్‌ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. నా బాధ వర్ణణాతీతం. ఆ ఆత్మహత్య గురించి వినగానే ధోనీకి ఫస్ట్ చాలా కోపం వచ్చింది’’ అని అరుణ్ పాండే వెల్లడించాడు.

dhoni,angry,sushanth,suicide,arun pandey ,అరుణ్ పాండే,  సుశాంత్, ధోని, కోపం, స్పందన



వాస్తవానికి సోషల్ మీడియాకి ధోనీ కాస్త దూరం ఉంటాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఆ దూరం మరింత పెరిగింది. ఇటీవల రిటైర్మెంట్‌పై రూమర్స్ పెరగడం కూడా దానికి ఓ కారణం కావొచ్చు. అయితే.. ధోనీ గురించి సమాచారం, రూమర్స్‌ని ఖండించే బాధ్యతని అతని భార్య సాక్షి గత కొంతకాలంగా చూస్తోంది. అందుకే.. సుశాంత్‌ సూసైడ్‌పై ధోనీ నుంచి ఎలాంటి ట్వీట్ రాలేదని తెలుస్తోంది. అతని భార్య సాక్షి కూడా సుశాంత్ గురించి ఎలాంటి ట్వీట్ చేయకపోవడం గమనార్హం. మొత్తంగా సుశాంత్‌ సూసైడ్ చేసుకోవడం ధోనీకి నచ్చలేదని అందుకే స్పందించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


Tags :
|
|

Advertisement