Advertisement

  • రన్ అవుట్ తో మొదలు పెట్టి ..అదే రన్ అవుట్ తో ముగించిన మహేంద్రుడు

రన్ అవుట్ తో మొదలు పెట్టి ..అదే రన్ అవుట్ తో ముగించిన మహేంద్రుడు

By: Sankar Sun, 16 Aug 2020 07:06 AM

రన్ అవుట్ తో మొదలు పెట్టి ..అదే రన్ అవుట్ తో ముగించిన మహేంద్రుడు


భారత క్రికెట్ లో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో అత్యంత ఫిట్ గా ఉండే ఆటగాడు ఎవరు అంటే చాల మంది చెప్పే సమాధానం ఎం స్ ధోని అని , అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి పదహారేళ్లు అవుతున్న కూడా ఇప్పటికి ఇంత ఫిట్ గా ఉండటం ధోనీకే సాధ్యం అయింది..అయితే అలంటి ధోని విచిత్రంగా తన కెరీర్ ను రన్ అవుట్ తో ప్రారంభించి రన్ అవుట్ తోనే ముగించాడు ..

2004లో బంగ్లాదేశ్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టిన ధోనీ.. పరుగులేమీ చేయకుండా రనౌట్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వికెట్ల మధ్య పరుగు తీయడంలో ప్రపంచ మేటీగా గుర్తింపు సాధించిన మహీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ రనౌట్ కావడం గమనార్హం. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో రనౌట్ అయిన ధోనీ ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు.

న్యూజిలాండ్ జరిగిన ఆ పోరులో.. టాపార్డర్ విఫలమైనా.. ధోనీ క్రీజులో ఉన్నంతవరకు టీమ్ విజయం అని అభిమానులంతా అనుకున్నారు. అలాంటి క్లిష్ట స్థితిలో గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రోకు రనౌట్ అయిన ధోనీ కండ్ల నిండా నీటితో పెవిలియన్ చేరడం సగటు క్రీడాభిమానులెవరూ మరిచిపోలేరు.

Tags :
|
|
|
|

Advertisement