Advertisement

  • నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది..పదేళ్ల వైవాహిక జీవితంపై సాక్షి ధోని..

నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది..పదేళ్ల వైవాహిక జీవితంపై సాక్షి ధోని..

By: Sankar Sun, 05 July 2020 4:22 PM

నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది..పదేళ్ల వైవాహిక జీవితంపై సాక్షి ధోని..



మహేంద్ర సింగ్ ధోని ..ఆన్ ఫీల్డ్ లో ఎంతటి సూపర్ స్టార్ ఆటగాడో , ఆఫ్ ది ఫీల్డ్ కూడా అంతే సింపుల్ గా ఉంటాడు ..మ్యాచ్లు లేకుంటే వెంటనే రాంచి వెళ్ళిపోయి తన ఫ్యామిలితో సరదాగా గడుపుతాడు ..ఇన్నేళ్ల కెరీర్లో ధోని మీద వచ్చిన వివాదాలు చాల తక్కువ ..తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షి సింగ్‌ను ప్రేమించిన ధోని 2010 జూలై 4న పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో వారి జీవితంలో ఆనంద క్షణాలే తప్ప ఎటువంటి గొడవలు లేవు. ఆనందంగా గడుపుతున్న వీరి జీవితంలోకి జీవా వచ్చి ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. తాజాగా పెళ్లి రోజును పురస్కరించుకొని ధోని భార్య సాక్షి గత పదేళ్లలో వారి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇందులో భాగంగా సాక్షి తన భర్త ధోనితో పాటు తమ గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసుకుంది.

మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. పదేళ్లుగా ఇద్దరం కలిసి ఒక ఆనంద జీవితం గడిపాం. ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాళ్లం. మా ఇద్దరి జీవితాల్లోకి జీవా రావడం ఒక మధురమైన క్షణం. జీవితంలో నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామంటే ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ' అంటూ రాసుకొచ్చారు.

అంతకముందు ధోని, సాక్షిల పెళ్లి రోజు పురస్కరించుకొని బంధువులు, స్నేహితులు, అభిమానులు విషెస్‌ చెప్పారు. దానికి బదులుగా.. 'మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.' అంటూ సాక్షి స్పందించారు.

Tags :
|
|
|

Advertisement