కరోనాను జయించిన ధారవి ..గడిచిన 24 గంటల్లో కేవలం ఆరు కేసులే నమోదు..
By: Sankar Mon, 13 July 2020 8:26 PM
ధారవి ..ముంబైలోనే గాక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ..దాదాపు పది లక్షల మంది అక్కడ నివాసం ఉంటున్నారు ..వాళ్ళు అందరూ పేదవాళ్ళే ..అయితే ధారవిలో కరోనా కేసులు నమోదు అవగానే అందరు ఆందోళన చెందారు ..అయితే కొంత కాలం కిందట అత్యధిక కేసులు నమోదు అయినా ధారవిలో ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో నమోదు అయ్యాయి ..
సోమవారం కేవలం ఆరు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ధారావిలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 2,381 కాగా, ఇందులో యాక్టివ్ కేసులు మాత్రం 96 అని బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ వైరస్ నుంచి ఇప్పటికే 2,039 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ర్టలో సోమవారం కొత్తగా 6,497 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రములో ఇప్పటి వరకు 2,60,924 కేసులు నమోదు అయ్యాయి. 10,482 మంది చనిపోయారు.