ధరణి పోర్టల్ పనితీరు బాగుంది ..రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
By: Sankar Thu, 05 Nov 2020 7:31 PM
ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. గురువారం నగరంలోని బీ.ఆర్.కే.ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సీఎస్ సందర్శించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్ను ఇప్పటి వరకు 5.84 లక్షల మంది వీక్షించారన్నారు. 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా రూ.7.77 కోట్లు చెల్లించారన్నారు. ఇప్పటి వరకు 5971 స్లాట్ బుకింగులు జరుగగా 6239 మంది డబ్బులు చెల్లించినట్లుగా చెప్పారు.
కంట్రోల్ రూంలో 100 మంది సభ్యుల బృందం ధరణిలో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. మరోవైపు తనతో సహా స్టాంపులు-రిజిష్ట్రేషన్ల శాఖ ఐ.జి. శేషాద్రి, ఇతర అధికారులు ధరణి పోర్టల్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.