కరోనా మందు రెడీ ...
By: Sankar Sun, 21 June 2020 5:03 PM
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు కంటిమీద కునుకు లేకుంట చేస్తున్న కరోనా వ్యాధికి మందు వచ్చేసినట్లు భారత్కు చెందిన గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోన వైరస్ గత మూడు నెలలుగా మందులేక ప్రపంచ దేశాలంటిని తన గుప్పిట్లో పెట్టుకుంది ..అమెరికా , చైనా వంటి అగ్ర రాజ్యాలు కూడా కరోనా దాటికి విలవిలలాడాయి ..భారత్లో కూడా కరోనా ప్రభావం చాలానే ఉంది ..మహారాష్ట్ర , గుజరాత్ , తమిళనాడు , ఢిల్లీ వంటి రాష్ట్రాలు కరోనా దెబ్బకు విలవిలా లాడుతున్నాయి . ఇటువంటి పరిస్థితుల్లో కరోనాకు మందు రావడం నిజంగా శుభపరిమాణమే చెప్పాలి..
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ములన ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్ రాబోయే రెండో వారాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది..
సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు తెలిపారు. ఇంజక్షన్ రూపంలో కోవిఫర్ 100mg మార్కెట్లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపింది. దీంతో కోవిడ్కు మందును కనిపెట్టిన ఘనత హైదరాబాద్ హెటిరోకి దక్కనుంది. ఇక కరోనా యాంటీ డ్రగ్ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.