ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో దేవ్దత్ అర్ధ శతకం
By: chandrasekar Tue, 22 Sept 2020 5:26 PM
బెంగళూరు జట్టు విజయంలో
ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ కీలక భూమిక పోషించాడు. ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో
అర్ధ శతకం బాదాడు. దీంతో ఐపీఎల్ ఆరంగేట్రపు మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసిన రెండో
యంగెస్ట్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కారు. ఇక, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ జట్టకు మంచి
ఆరంభం అందించడంలో దేవ్దత్ తోడ్పడ్డాడు. తొలి వికెట్కు ఫించ్తో కలిసి 90
పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన దేవ్దత్.. 42
బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ పదకొండ ఓవర్లో విజయ్
శంకర్ చేతిలో జౌట్ అయ్యాడు. ఇక, ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వకముందు దేశవాళీ క్రికెట్లో
దేవ్దత్ తనదైన ఆటతీరుతో రాణించిన సంగతి తెలిసిందే.
బెంగళూరు జట్టులో దేవ్దత్, డివిలియర్స్
హాఫ్ సెంచరీలతో మెరిసారు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్
జట్టులో బెయిర్స్టో ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక, చివర్లో
బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో.. హైదరాబాద్ జట్టు 153 పరుగులకు అలౌటైంది.
కీలకమైన సమయంలో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన
చాహల్ను మ్యాన్ ఆప్ ది మ్యాచ్ వరించింది.