Advertisement

నంద్యాలలో ప్రముఖ దంత వైద్యురాలు ఆత్మహత్య

By: Sankar Mon, 17 Aug 2020 09:06 AM

నంద్యాలలో ప్రముఖ దంత వైద్యురాలు ఆత్మహత్య


కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ దంత వైద్యురాలు ఆత్మహత్య కలకలంరేపింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. నంద్యాల శ్రీనివాసనగర్ సమీపంలో డాక్టర్ మాధవీలత డెంటల్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. భరతమాత దేవాలయం సమీపంలో ఆమె నివసించేశారు.

ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరి వేసుకున్నారు.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.

మాధవీలత ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె బంధువులు, స్నేహితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో నంద్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా మాధవీలతది ప్రేమ వివాహం.. భర్త కూడా డెంటల్ డాక్టర్. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. భర్త పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు స్పాట్‌లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దంపతులు బయటకు వెళ్లాలనుకున్నారు.. కానీ భర్త పిల్లలు మాత్రమే బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement