Advertisement

ఢిల్లీలో కొత్తగా 69 కరోనా మరణాలు

By: Sankar Sun, 06 Dec 2020 10:04 PM

ఢిల్లీలో కొత్తగా 69 కరోనా మరణాలు


దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 2,706 పాజిటివ్‌ కేసులు రిపోర్టు కాగా 69 మరణాలు సంభవించాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,92,250కు, మొత్తం మరణాల సంఖ్య 9,643కు పెరిగింది. గత 24 గంటల్లో 4,622 మంది రోగులు కోలుకున్నారు.

దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 5,57,914కు చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 24,693 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది.

Tags :
|
|
|
|

Advertisement