Advertisement

ఉగ్రదాడి అనుమానం ...ఢిల్లీలో హై అలెర్ట్

By: Sankar Sun, 21 June 2020 8:13 PM

ఉగ్రదాడి అనుమానం ...ఢిల్లీలో హై అలెర్ట్



కరోనా తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీ మీదకు మరొక ఉపద్రవం ముంచుకొస్తుంది అని హెచ్చరికలు వస్తున్నాయి..చాల కాలంగా ఎలాంటి ఉగ్ర దాడులు లేకుంట ప్రశాంతంగా ఉంటున్న ఢిల్లీ పై ఉగ్రవాద దాడులు జరగొచ్చంటూ నిఘావర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేశారు. జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో అలర్ట్ ప్రకటించారు.

దేశ రాజధానిలో దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. బస్సు, కారు లేదా టాక్సీ ద్వారా ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి ప్రవేశించవచ్చని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, బస్సు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలిస్తున్నారు. ఢిల్లీ బయట కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల డీసీపీలు, స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్లు హై అలర్ట్‌లో ఉన్నాయి.

Tags :
|
|
|
|

Advertisement