Advertisement

దారుణంగా 22సార్లు కత్తితో పొడిచి హత్యచేశారు...!

By: Anji Sat, 12 Dec 2020 5:07 PM

దారుణంగా 22సార్లు కత్తితో పొడిచి హత్యచేశారు...!

రెండు వర్గాల మధ్య గొడవను ఆపడానికి ప్రయత్నించి వారి ఆగ్రహానికి ఓ యువకుడు బలపోయిన విషాదకర ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు కృష్ణ, రవి ఈ ఇద్దరూ ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.

కానీ, ఈ ఇద్దర్నీ తొలగించి ముకేశ్, రాకేశ్‌లను చేర్చుకోవడంతో వారిపై కక్ష పెంచుకుని దాడికి కుట్రపన్నారని తెలిపారు.

బుధవారం రాత్రి రాకేశ్, ముకేశ్ తమ విధులు ముగించుకుని వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. వారి స్నేహితుడు నీరజ్ కూడా ఆ సమయంలో ఉన్నాడని వివరించారు. ఆస్పత్రి నుంచి వెళ్తుండగా కృష్ణ, రవి మరో మైనర్‌తో కలిసి వారిని తోవలో అడ్డగించారు.

ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుని, హింసకు దారితీసింది. ముకేశ్, రాకేశ్‌పై నిందితులు దాడిచేయగా దీనిని నీరజ్ అడ్డుకున్నాడు. దీనికి ఆగ్రహించిన నిందితులు అతడిని కత్తితో దారుణంగా పొడిచారు.

ముకేశ్, రాకేశ్‌లకు గాయాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నైరుతి ఢిల్లీ డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. హత్య కేసు నమోదుచేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. మైనర్ ఇప్పటికే నిర్బంధంలో ఉన్నాడని పేర్కొన్నారు.

Tags :

Advertisement