Advertisement

  • బెంగళూరు పై అజింక్య రహానే మరియు శిఖర్ ధావన్ రాణించడంతో రెండో స్థానానికి చేరిన ఢిల్లీ

బెంగళూరు పై అజింక్య రహానే మరియు శిఖర్ ధావన్ రాణించడంతో రెండో స్థానానికి చేరిన ఢిల్లీ

By: chandrasekar Tue, 03 Nov 2020 5:09 PM

బెంగళూరు పై అజింక్య రహానే మరియు శిఖర్ ధావన్ రాణించడంతో రెండో స్థానానికి చేరిన ఢిల్లీ


బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్ లో అజింక్య రహానే మరియు శిఖర్ ధావన్ అద్భుతమైన బాటింగ్ ప్రదర్శనతో ఢిల్లీ విజయాన్ని సాధించి రెండో స్థానానికి చేరింది. ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఓడిన బెంగళూరు జట్టు ముందంజ వేయడం ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది. 153 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌(54: 41 బంతుల్లో 6ఫోర్లు), రహానె(60: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో ఆకట్టుకోలేక పోయింది. ఢిల్లీ పై బెంగళూరు బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు దేవదత్‌ పడిక్కల్‌ (50: 41 బంతుల్లో 5ఫోర్లు) నిలకడమైన ప్రదర్శనతో ఒక్కడే రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(29), ఏబీ డివిలియర్స్‌(35) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. దీనివల్ల బెంగళూరు తక్కువ స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టు లక్ష్య ఛేదనలో బాటింగ్ ప్రారంభించడంతో సునాయాసంగా ఈ తక్కువ లక్షయాన్ని చేరుకుంది.

Tags :
|

Advertisement