Advertisement

  • కరోనాతో మరణించిన సఫాయి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన ఆ రాష్ట్ర సీఎం

కరోనాతో మరణించిన సఫాయి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన ఆ రాష్ట్ర సీఎం

By: Sankar Fri, 21 Aug 2020 2:09 PM

కరోనాతో మరణించిన సఫాయి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన ఆ రాష్ట్ర సీఎం


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ పారిశుద్ధ కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయ‌ల చెక్‌ను బ‌హూక‌రించారు. స‌ఫాయి కార్మికుడు రాజు ఇటీవ‌ల క‌రోనా వైర‌స్‌తో మ‌ర‌ణించాడు. కార్మికుడ రాజును ఢిల్లీ స‌ర్కార్ ఫ్రంట్‌లైన్ యోధుడిగా గుర్తించింది. బారా హిందూ రావు హాస్పిట‌ల్‌లో రాజు విధులు నిర్వ‌ర్తించాడు.

స‌ఫాయి రాజు ఇంటికి వెళ్లిన సీఎం కేజ్రీవాల్‌.. అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు కోటి రూపాయ‌ల చెక్ ను అంద‌జేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. క‌రోనా వారియ‌ర్ల‌పై గ‌ర్వంగా ఉంద‌న్నారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి స‌ఫాయి కార్మికుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన‌ట్లు సీఎం కేజ్రీ తెలిపారు. స‌ఫాయి యోధుడి ఇంటికి వెళ్లి కోటి చెక్ అంద‌జేసిన‌ట్లు చెప్పారు. ఈ సాయంతో అత‌ని కుటుంబానికి కొంత ఊర‌ట ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కేజ్రీ తెలిపారు.

కాగా ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి ..కరోనా ప్రారంభంలో ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి..అయితే ప్రభుత్వం మరియు కరోనా వారియర్స్ కృషితో ఢిల్లీ కరోనా కేసులు మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి..

Tags :
|
|
|
|

Advertisement