Advertisement

  • ఐపీయల్ ఫైనల్ కు చేరడం అద్భుతంగా అనిపిస్తుంది ...ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

ఐపీయల్ ఫైనల్ కు చేరడం అద్భుతంగా అనిపిస్తుంది ...ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

By: Sankar Mon, 09 Nov 2020 4:02 PM

ఐపీయల్ ఫైనల్ కు చేరడం అద్భుతంగా అనిపిస్తుంది ...ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్


ఆదివారం జరిగిన ఐపీఎల్‌-2020 క్వాలిఫైయర్‌- 2 మ్యాచ్‌లొ సన్‌రైజర్స్‌పై గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అబుదాబిలోని షేక్ జాయేద్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఇచ్చిన 190 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఛేదించలేకపోయింది..

ఈ సందర్భంగా అయ్యర్‌ మాట్లాడుతూ.. తమ విజయానికి కొన్ని కీలక నిర్ణయాలు కారణమని చెప్పాడు. ‘ఈ విజయానుభూతి అద్భుతంగా ఉంది. రోలర్‌ కాస్టర్‌లా హెచ్చుతగ్గులు వచ్చినప్పటికీ మా జట్టంతా ఒకకుటుంబంలా ఉన్నాం. కెప్టెన్‌గా చాలా బాధ్యతలు ఉన్నా, టాపార్డార్‌ బ్యాట్స్‌మెన్‌ గాను నిలకడను కొనసాగించాలి.

కోచ్‌ల నుంచి, యాజమాన్యం నుంచి నాకు గొప్ప మద్ధతు లభించింది. ఇలాంటి జట్టుతో ఉండటం నిజంగానా అదృష్టం. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి’ అని అన్నాడు.ఇక ఈ మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌తో కలసి ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ బరిలోకి దిగాడు. 27 బంతుల్లో 38 చేసి శుభారంభాన్ని ఇవ్వడమే కాకుండా మూడు కీలక వికెట్లు తీశాడు. మరో ఓపెనర్‌ ధావన్‌ 50 బంతుల్లో 78 పరుగులుచేశాడు.

Tags :
|
|

Advertisement