ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ ..స్టార్ స్పిన్నర్ అశ్విన్ కు గాయం
By: Sankar Mon, 21 Sept 2020 4:18 PM
నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో శ్రేయాస్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే..అయితే వారికి ఇదే మ్యాచ్లో ఒక ఖేదం కూడా జరిగింది..అదే ఆ జట్టు స్టార్ స్పిన్నర్ అశ్విన్ గాయపడటం..ఒక్క ఓవర్ బౌలింగ్ చేసిన అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు..అయితే అదే ఓవర్లో గాయం కారణంతో మైదానం వీడాడు..ఆ తర్వాత తిరిగి బౌలింగ్ కు రాలేదు..
తన తొలి ఓవర్ మొదటి బంతికే కరుణ్ నాయర్ను పెవిలియన్ పంపిన అశ్విన్...ఐదో బంతికి నికోలస్ పూరన్ను బౌల్డ్ చేశాడు. ఓవర్ ఆఖరి బంతిని మాక్స్వెల్ లాంగాన్ వైపు ఆడగా బంతిని ఆపేందుకు అశ్విన్ డైవ్ చేశాడు.బంతిని అడ్డుకునే క్రమంలో అశ్విన్ ఎడమ భుజానికి బలంగా దెబ్బ తగిలింది.
దీంతో ఫిజియో సహాయంతో అశ్విన్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకే ఒక్క ఓవర్ వేసిన అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టి రెండు పరుగులే ఇచ్చాడు. ఆఫ్స్పిన్నర్ అశ్విన్ స్థానంలో అజింక్య రహానె ఫీల్డర్గా వచ్చాడు.