ఫన్నీగా రనౌట్ ఐన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్
By: chandrasekar Mon, 21 Sept 2020 11:52 AM
దుబాయ్ వేదికగా ఆదివారం
రాత్రి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫన్నీగా
రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన పంజాబ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మూడో బంతిని బౌన్సర్ రూపంలో శిఖర్ ధావన్
శరీరంపైకి సంధించగా దాన్ని థర్డ్ మ్యాన్
దిశగా ధావన్ హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్కి కనెక్ట్ అవని బంతి నేరుగా
వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లోకి వెళ్లింది. అయితే బౌన్స్ ఐన బంతిని అందుకోవడంలో రాహుల్
విఫలమయ్యాడు. దాంతో అతని గ్లౌవ్స్ని తాకి
పక్కకి ఎగిరింది.
కీపర్ కేఎల్ రాహుల్ పక్కన
కాస్త దూరంలో బంతి పడటంతో సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోని పృథ్వీ షా (5: 9
బంతుల్లో 1x4)ని శిఖర్ ధావన్ పిలవగా అతను కూడా రెస్పాండ్ అయ్యాడు. కానీ.. బంతి
వద్దకి వేగంగా కేఎల్ రాహుల్ చేరుకోవడంతో పృథ్వీ షా మనసు మార్చుకుని నాన్స్ట్రైక్
ఎండ్లోనే ఉండిపోయాడు. కానీ పృథ్వీ షా ఆగిపోయిన విషయాన్ని గమనించని శిఖర్
ధావన్ వెనుక వైపు బంతిని చూస్తూ అలానే
పిచ్ సగంలోకి వచ్చేశాడు. దాంతో పృథ్వీ షా
గట్టిగా అరవగా అప్పటికే చాలా దూరం
వచ్చేసిన శిఖర్ ధావన్ మళ్లీ క్రీజులోకి వెళ్లలేకపోయాడు. కేఎల్ రాహుల్ విసిరిన
త్రోని చక్కగా అందుకున్న గౌతమ్ కీపర్ ఎండ్లో
బెయిల్స్ని పడగొట్టాడు. దాంతో కనీసం
పరుగుల ఖాతా కూడా తెరవకుండానే శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు.