ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ ..గాయంతో స్టార్ ఓపెనర్ ఐపీయల్ కు దూరం
By: Sankar Fri, 28 Aug 2020 7:22 PM
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసక బ్యాట్స్మెన్ జేసన్ రాయ్ గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవాలని గురువారం నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్తో శుక్రవారం నుంచి జరుగనున్న మూడు టీ20 సిరీస్ కోసం సిద్ధమయ్యే క్రమంలో ఈ ఇంగ్లాండ్ డ్యాషింగ్ ఓపెనర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో పక్కటెముకలకి తీవ్రమైన గాయం కావడంతో రాయ్ ఈ ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
2018 ఐపీఎల్లో ఢిల్లీ జట్టులో ఆడిన జేసన్నాయ్.. వరల్డ్కప్ కోసమని 2019 సీజన్లో ఆడలేదు. ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రాయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ మళ్లీ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. జేసన్రాయ్ ఓపెనర్గానే కాకుండా మిడిలార్డర్లో కూడా పరుగుల వరద సృష్టించగలడు. జేసర్ రాయ్ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ డేనియల్ శామ్స్ని తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇంగ్లాండ్ లిమిటెడ్ ఓవర్ల జట్టులో కీలక ఆటగాడు అయిన జాసన్ రాయ్ తన విధ్వంసక బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సామర్థ్యం కల ఆటగాడు..అయితే ఢిల్లీ జట్టులో ఇప్పటికే ధావన్ , పృథ్వి షా రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉండటంతో జాసన్ రాయ్ స్థానంలో ఢిల్లీ యాజమాన్యం ఫాస్ట్ బౌలర్ ను తీసుకుంది..