వచ్చే ఏడాది మరింత బలంగా ఎంట్రీ ఇస్తాము...ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్
By: Sankar Sun, 15 Nov 2020 06:58 AM
ఐపీఎల్ -14 సీజన్ గెలుచుకునేంది తామే నంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. 2020 ఐపీఎల్ సీజన్లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్.
ఈ సీజన్ ఆద్యంతం తమ ఆటగాళ్లు బాగా ప్రదర్శన చేశారని ప్రశంసించింది. వచ్చే సీజన్లో తమ జట్టు మరింత బలంగా తయారై ఎంట్రీ ఇస్తుదని అన్నారు. గెలిచి తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సీజన్లో ఢిల్లీ ఫైనల్కు చేరుకోవడానికి కోచింగ్ సిబ్బంది మహ్మద్ కైఫ్, విజయ్ దాహియా, రియాన్ హ్యారిస్ బాగా తోడ్పడ్డారని.. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు..
కాగా ఈ ఏడాది జరిగిన ఐపీయల్ లో అద్భుతంగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ సేన ఫైనల్ దాకా వచ్చింది...అయితే ఫైనల్లో మాత్రం దిగ్గజ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది..ఈ ఐపీయల్ లో కేవలం ముంబై ఇండియన్స్ చేతిలోనే నాలుగు సార్లు ఓడిపోయింది...