- హోమ్›
- వార్తలు›
- ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాము ...ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాము ...ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్
By: Sankar Thu, 05 Nov 2020 6:57 PM
ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరగబోయే తొలి క్వాలిఫయర్ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అయితే ముంబై జట్టు అంటే తమకు ఎలాంటి భయం లేదని, ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం అని పేర్కొన్నాడు.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించడంతో టాప్-2కు చేరింది. ఇక అంతకముందే అగ్ర స్థానంలో ముంబై ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... 'ముంబై ఇండియన్స్ జట్టు అంటే మాకు ఎలాంటి భయం లేదు. ముంబై అత్యుత్తమ జట్లలో ఒకటి. అయినా మాలో ఆత్మవిశ్వాసం ఉంది. మా జట్టు కూడా బలంగానే ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబై పై విజయం సాధిస్తామా లేదా అనేది ఆరోజు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ముంబైకు ఫైనల్స్ ఆడిన అనుభవం చాలా ఎక్కువ. ఆ జట్టు పటిష్టంగా ఉందనే విషయం ఒప్పుకోవాలి. అప్పటి పరిస్థితిని బట్టే విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఏ విషయాన్నైనా ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడిలో పడతాం. అది పెద్ద సమస్యగా మారిపోతుంది' అని తెలిపాడు. ఇక ముంబై- ఢిల్లీ జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరుగుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతో క్వాలిఫయర్-2 లో పాల్గొంటుంది.