Advertisement

ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్‌కి ఓటమి

By: chandrasekar Mon, 05 Oct 2020 09:34 AM

ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్‌కి ఓటమి


యూఏఈ లో జరిగిన MI vs SRH మధ్య జరిగిన మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. ఆదివారం షార్జా స్టేడియం వేదికగా జరిగిన 17వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్‌కి ఓటమి తప్పలేదు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (6) సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు.

తరువాత క్వింటన్ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతూ మ్యాచ్‌ని ముందుకి తీసుకెళ్లారు. డీకాక్‌ 67 పరుగులతో ( 39 బంతుల్లో 4X4, 6X4 ) రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 27 పరుగులు ( 18 బంతుల్లో 6X4) ), ఇషాన్‌ కిషన్‌ 31 పరుగులు ( 23 బంతుల్లో 4X1, 6X2), హార్దిక్‌ పాండ్యా 28 పరుగులు (19 బంతుల్లో 4X2, 6X2), పొలార్డ్‌ 25 పరుగులు ( 13 బంతుల్లో 6X3) ఆకట్టుకున్నారు. చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన కృనాల్‌ పాండ్యా సైతం తన బ్యాట్ ఝులిపించాడు. 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆటగాళ్లందరూ సమష్టికృషితో రాణించడంతో ముంబై ఇండియన్స్‌ 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌లు చెరో రెండు వికెట్లు తీసుకోగా రషీద్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కింది. కానీ బాటింగ్ లో విజయాన్నిసన్‌రైజర్స్ అందుకోలేక పోయారు.

Tags :
|

Advertisement