మీడియాకు చిక్కకుండా దీపికా, సారా అలీఖాన్
By: chandrasekar Fri, 25 Sept 2020 12:13 PM
బాలీవుడ్ హీరోయిన్లు
దీపికాపదుకొనే, సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఆరోపణలు
ఎదుర్కొంటున్నారు. వీరికి ఎన్సీబీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
శుక్రవారం దీపికాపదుకొనేను విచారించనుండగా, శనివారం సారా అలీఖాన్, శ్రద్దాకపూర్
విచారణకు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో సారా
అలీఖాన్, దీపికాపదుకొనే
గోవా నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారి రాకతో మీడియా ప్రతినిధులతో
ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. దీపికా మాత్రం మీడియాకు చిక్కకుండా స్పెషల్
చార్టెడ్ ఫ్లైట్ లో ముంబైకు వెళ్లింది.
అయితే సారా అలీఖాన్ ను
మీడియా రౌండప్ చేసే ప్రయత్నం చేస్తుండటంతో సెక్యూరిటీ సిబ్బంది సారా, తల్లి
అమృతాసింగ్ ను బయటకు రానీయలేదు. ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతికష్టం
మీద సారా, అమృతాతో కలిసి మీడియాకు దొరకకుండా కారులో పయనమయ్యారు.