Advertisement

  • దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన యాజమాన్యం

దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన యాజమాన్యం

By: Sankar Mon, 09 Nov 2020 4:41 PM

దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన యాజమాన్యం


బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్దమైంది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్‌ చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.

గతేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది రూ.68,500 చొప్పున ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీ నుంచి కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. దీనికి సంబంధించిన సర్కిలర్‌ను తాజా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇటీవల జేబీసీసీఐ 10వ సమావేశంలో జరిగిన ఒప్పందం మేరకు బోనస్‌ను చెల్లిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితో సింగరేణిలో పని చేస్తోన్న దాదాపు 43 వేల మందికి ఈ దీపావళి కానుక అందనుంది.

Tags :
|
|

Advertisement