Advertisement

  • రైనా మళ్ళీ ఐపీయల్ ఆడటానికి వస్తాడు.. దీప్ దాస్‌గుప్తా

రైనా మళ్ళీ ఐపీయల్ ఆడటానికి వస్తాడు.. దీప్ దాస్‌గుప్తా

By: Sankar Thu, 10 Sept 2020 5:05 PM

రైనా మళ్ళీ ఐపీయల్ ఆడటానికి వస్తాడు.. దీప్ దాస్‌గుప్తా


ఐపీయల్ పదమూడవ సీజన్ మరి కొద్దీ రోజుల్లో యూఏఈ ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే..అయితే చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు అయిన రైనా అర్దాంతరంగా ఐపీయల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే..హోటల్ గది విషయంలో సిఎస్కే జట్టు యాజమాన్యంతో తనకు గొడవ జరిగిందని అందుకే అతను తిరిగి వచ్చేసాడు అంటూ ప్రచారం జరిగింది.

కానీ రైనా మాత్రం తన మామ హత్య కారణంగా నేను భారత్ కు వచ్చాను అని చెప్పాడు.. ఐపీఎల్ ను వీడిన ప్రాక్టీస్ చేస్తున్నానని, మళ్ళీ తనను దుబాయ్ లో చూసే అవకాశం కూడా ఉందన్నాడు. ఇక రైనా రీఎంట్రీ పై ఆ జట్టు ఓనర్ ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. అది నా చేతిలో లేదు. రైనా విషయం లో ధోని, టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు.

దాంతో రైనా రీఎంట్రీ పై చర్చ జరుగుతున్న నేపధ్యం లో భారత మాజీ ఆటగాడు దీప్ దాస్‌గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్ లో సురేష్ రైనా ఆడుతాడు అని నేను అనుకుంటున్నాను. క్వారంటైన్ నిబంధనల కారణంగా ప్రారంభ మ్యాచ్ లకు దూరం అవుతాడు కావచ్చు, కానీ రైనా రీఎంట్రీ మాత్రం పక్క ఉంటుంది అనేది నా అంచనా. అందుకే రైనా స్థానం లో సిఎస్కే ఎవర్ని తీసుకోకపోయినా నాకు ఆశ్చర్యం అనిపించలేదు అని పేర్కొన్నాడు.


Tags :
|
|
|
|
|

Advertisement