దేశంలో తగ్గిన కొత్త కరోనా కేసులు, మరణాలు
By: chandrasekar Wed, 19 Aug 2020 12:41 PM
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్...
దేశంలో కొత్త కరోనా కేసులు, మరణాలు ఈ నెల 13 నుంచి తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కేసుల పాజిటివిటీ రేటు
10.03 నుంచి 7.72కు పడిపోయిందని మంగళవారం తెలిపారు.
ఈ నెల 13న 64 వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఇప్పుడది 55,079కి పడిపోయిందన్నారు. కొత్త కేసులు, మరణాల రేటు తగ్గుముఖం పట్టడం కొంత సంతృప్తికరంగా ఉన్నా, దేవుడిపై భారం వేయడానికి ఇది సమయం కాదన్నారు. రోజువారీ మరణాల రేటు 1.92 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
Tags :
cases |
deaths |