ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
By: chandrasekar Fri, 09 Oct 2020 12:27 PM
ఏపీలో గురువారం విడుదల
చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 66,944 శాంపిల్స్ పరీక్షించగా మరో 5292
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,36,824కు చేరింది. గడచిన 24 గంటల్లో 42మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6128కి
చేరింది. గత 24 గంటల్లో 6,120మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,84,930 నమోదయ్యింది. మరో 48,661మంది హాస్పిటల్లో
చికిత్స పొందుతున్నారని తెలిపింది.
గత 24
గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 784,
తూర్పు గోదావరి జిల్లాలో 652, పశ్చిమగోదావరి
జిల్లాలో 612, ప్రకాశం జిల్లాలో 591, గుంటూరు జిల్లాలో 493, కృష్ణా
జిల్లాలో 399, అనంతపురం జిల్లాలో 362, కడప జిల్లాలో 323, నెల్లూరు
జిల్లాలో 311, శ్రీకాకుళం జిల్లాలో 204, విశాఖపట్నం జిల్లాలో 198, విజయనగరం
జిల్లాలో 188, కర్నూలు జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 103898 పాజిటివ్ కేసులు. తర్వాత
పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు 72,529కు చేరాయి. చిత్తూరు జిల్లాలో 68,146 కేసులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రికవరీ
రేటు కూడా పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా తగ్గింది.