Advertisement

  • ధోని టీమిండియా రీఎంట్రీ కి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి ..డీన్ జోన్స్

ధోని టీమిండియా రీఎంట్రీ కి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి ..డీన్ జోన్స్

By: Sankar Fri, 24 July 2020 4:11 PM

ధోని టీమిండియా రీఎంట్రీ కి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి ..డీన్ జోన్స్



టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి ఇండియన్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి అన్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ ..2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత కనీసం దేశవాళీ క్రికెట్‌లో కూడా మ్యాచ్‌లు ఆడలేదు. దాంతో.. టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి ధోనీ పేరుని బీసీసీఐ తప్పించగా.. ఇక అతని కెరీర్ ముగిసినట్లేనని వార్తలు వచ్చాయి. కానీ.. ధోనీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

అయితే ఐపీఎల్ 2020 సీజన్‌‌కి మార్గం సుగమం కావడంతో ధోనీ రీఎంట్రీపై ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో ధోనీ పునరాగమనంపై డీన్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు భారత సెలక్టర్లు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేయాలని ఆశిస్తున్నారు. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ మెరుగ్గా రాణించగలిగితే..? అప్పుడు అతని రీఎంట్రీకి దారులు తెరుచుకుంటాయి.

అయితే.. పొరపాటున ఐపీఎల్‌లో ధోనీ ఫెయిలైతే ఇక అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే. మొత్తంగా ఒక్కటి మాత్రం చెప్పగలను. ధోనీకి ఐపీఎల్ రూపంలో టీమిండియాలోకి రీఎంట్రీ కోసం తలుపు తెరిచే ఉంది. కరోనా వైరస్ కారణంగా లభించిన బ్రేక్ కూడా అతనికి బాగా ఉపయోగపడనుంది’’ అని వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement