Advertisement

  • చనిపోయాడు అని బాక్స్ లో పెడితే 20 గంటల తర్వాత లేచి కూర్చున్నాడు

చనిపోయాడు అని బాక్స్ లో పెడితే 20 గంటల తర్వాత లేచి కూర్చున్నాడు

By: Sankar Fri, 16 Oct 2020 8:57 PM

చనిపోయాడు అని బాక్స్ లో పెడితే 20  గంటల తర్వాత లేచి కూర్చున్నాడు


చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడు అని పురాణాల్లో చదివి ఉంటాం. నిజంగా జరిగిన సంఘటనలు చాలా అరుదు. చనిపోయిన పెద్దాయన 20 గంటల తరువాత లేచి కూర్చున్న ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, తమిళనాడుకు చెందిన 74 ఏళ్ల సుబ్రహ్మణ్యన్ కుమార్ అనే వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. ఎలాంటి కదలికలు లేకపోవడంతో మరణించాడని చెప్పి ఫ్రీజర్ శవపేటిక తెప్పించి అందులో ఉంచారు. చుట్టాలు అందరికి కబురు చేశారు. చుట్టాలు వచ్చే వరకు శవాన్ని ఆ ఫ్రీజర్ లోనే ఉంచారు.

దాదాపుగా 20 గంటలపాటు ఫ్రీజర్ లోనే శవం ఉన్నది. తరువాత దహన సంస్కారాలకు సిద్ధం చేసి ఫ్రీజర్ నుంచి శవాన్ని తీసేందుకు సిద్ధం అవుతుండగా, ఆ శవంలో కదలికలు కనిపించాయి. ఆ తరువాత బాలసుబ్రమణ్యన్ లేచి కూర్చుకున్నాడు. దీంతో బంధువులు షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి తిరిగి బతికాడని, ఇదంతా దైవలీలా అని చెప్తున్నారు.

Tags :
|

Advertisement