ఘోరం: కరోనా మృతదేహాన్ని వదలని కక్కుర్తిగాళ్లు..
By: Anji Thu, 27 Aug 2020 3:35 PM
విజయనగరం జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. కరోనా సమయంలో కూడా కొంతమంది దొంగలు రెచ్చిపోతున్నారు. వైరస్తో చనిపోయిన వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తున్నారు.
విజయనగరంలో జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. వీరఘట్టం మండలం ఏమ్ రాజపురంకు చెందిన సరస్వతీ అనే మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ మహిళ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కరోనాతో చనిపోయిన సరస్వతి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అంత్యక్రియలకు సంబందించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మార్చురీ సిబ్బంది ముందు మృతదేహాన్ని చూపించకుండా తరలించేందుకు ప్రయత్నం చేశారు. స్మశానంలో మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారం కనిపించ లేదు. ఐదు తులాలు విలువజేసే బంగారు గొలుసు, ఉంగరాలు మాయమైంది. దీంతో విషయం బయటపడింది. బంధువులు వెంటనే చనిపోయిన మహిళ వద్ద ఉన్న బంగారం మొత్తం మాయమైందని ఆస్పత్రి వారికి ఫిర్యాదు చేశారు. ఏం జరిగిందని ఆరా తీస్తే మార్చురీ సిబ్బంది చేతివాటం ఉపయోగించారని తేలింది.