ఆ విధ్వంసక ఆటగాడు రిటైర్ అవ్వడం బౌలర్లకు శుభపరిణామం ..కుల్దీప్ యాదవ్
By: Sankar Fri, 03 July 2020 4:32 PM
సౌత్ ఆఫ్రికా విధ్వంసక వీరుడు ఎబి డివిలియర్స్ మీద భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం మంచి పరిణామం అని వ్యాఖ్యానించాడు. లేకపోతే తనలాంటి బౌలర్లు ఎంతోమంది బలయ్యే వాళ్లమని పేర్కొన్నాడు. ఇలా తాను కూడా ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ జోరు ముందు తేలిపోయిన బౌలర్నేనని చెప్పకనే చెప్పేశాడు. వన్డేల్లో ఏబీ ఎంతో విలువైన ఆటగాడు. అతనిది ప్రత్యేకమైన స్టైల్. ఇప్పుడు అతని బెంగలేదు... రిటైర్ అయిపోయాడు. ఇదొక మంచి పరిణామమే.
మిగతా వారితో పోలిస్తే ఏబీ చాలా డేంజర్. నాకు డివిలియర్స్కు బౌలింగ్ చేయడమంటే కత్తిమీద సాములా ఉండేది. నన్ను అత్యంత భయపెట్టిన బ్యాట్స్మన్ ఏబీ. నా బౌలింగ్లో ఎదురుదాడి చేసి ఏబీ భారీగా పరుగులు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన క్రికెట్బాజీ లేటెస్ట్ ఎపిసోడ్లో మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తాతో పలు విషయాల్ని కుల్దీప్ షేర్ చేసుకున్నాడు..
ఈ క్రమంలోనే డివిలియర్స్ బ్యాటింగ్కు భయపడ్డ పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో టెస్టుల్లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చాలెంజింగ్ ఉంటుందన్నాడు. ఎక్కవ బ్యాక్ ఫుట్లో ఆడటమే కాకుండా చాలా ఆలస్యంగా బంతిని ఆడటం తనకు సవాల్గా ఉండేదన్నాడు. ఇక 2019 ఐపీఎల్లో ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, మొయిన్ అలీలు తనను చితక్కొట్టిన విషయాన్ని కూడా కుల్దీప్ గుర్తు చేసుకున్నాడు.
అయితే 2018లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్,.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ జరుగుంటే డివిలియర్స్ పునరాగమనం షురూ అయ్యేది. ఈ మేరకు ఏబీతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరిపింది కూడా. అయితే వరల్డ్కప్ జరిగే అవకాశం లేకపోవడంతో ఏబీ రీఎంట్రీ అనేది డైలమాలో పడింది. ఇదే విషయాన్ని డివిలియర్స్ కూడా స్పష్టం చేశాడు..కరోనా కారణంగా అసలు క్రికెట్ మ్యాచ్ లు ఎప్పుడు మొదలవుతాయి ఎవ్వరు చెప్పలేకపోవడంతో ఎబి రీఎంట్రీ పై అభిమానులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి