ఇండియా ఆస్ట్రేలియా రెండో టెస్ట్ ...భారీ మార్పులతో రెండు జట్లు బరిలోకి
By: Sankar Thu, 24 Dec 2020 10:10 AM
అడిలైడ్ లో ఇండియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో ఘనవిజయం సాధించి ఊపు మీద ఉన్న ఆస్ట్రేలియాకు రెండో టెస్టుకు ముందు ఎదురుదెబ్బ తగిలింది...స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు..దీనితో అతడు రెండో టెస్ట్ కు కూడా దూరం అవుతున్నాడు..దీనితో తొలి టెస్ట్ లో ఆడిన ఓపెనర్లతోనే ఆస్ట్రేలియా బరిలోకి దిగే అవకాశం ఉంది...
ఇక టీం ఇండియా లో కూడా అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది....కెప్టెన్ కోహ్లి స్వదేశం చేరడంతో తాత్కాలిక కెప్టెన్ రహానే నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓపెనర్ పృథీ్వషా పేలవ ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు ఖాయమనుకుంటున్న శుబ్మన్ గిల్ నెట్స్లో అదేపనిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు...
ఇక విహారి స్థానంలో జడేజా, స్వదేశానికి వెళ్లిన కోహ్లీ స్థానంలో రాహుల్ ,గాయపడిన షమీ స్థానంలో సిరాజ్ లేదా నవదీప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది..ఇక స్టార్ ఓపెనర్ రోహిత్ కరోనా ప్రొటొకాల్స్ ప్రకారం సిడ్నీ లోనే ఉండటంవలన రెండో టెస్ట్ కు అందుబాటులో లేకుండా అయ్యాడు....