కన్న తండ్రే కూతుర్ని రూ. 5 వేలకు విక్రయించే ప్రయత్నం
By: chandrasekar Wed, 02 Dec 2020 09:38 AM
ఒకతను తన కన్న కూతుర్నే
విక్రయించే ప్రయత్నం చేసాడు. కన్నకూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రే
అంగట్లో అమ్మకానికి పెట్టిన ఉదంతం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో ఓ
తండ్రి బార్లోనే కూతురు అమ్మకానికి పెట్టాడు. కూతుర్ని రూ. 5 వేలకు
విక్రయించే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన కొందరు స్థానికులు నిందితుడికి ట్విస్ట్
ఇచ్చారు. ఈ విషయాన్ని నేరుగా పోలీసులకు చేరవేశారు. దీంతో విజయవాడ వన్ టౌన్ పోలీసులు
వెంటనే రంగంలోకి దిగి సకాలంలో ఆ పాపను కాపాడారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన
సతీష్ అనే వ్యక్తి విజయవాడలో ఉంటున్నాడు. అతను తన కూతుర్ని అమ్మకానికి పెట్టాడు.
సతీష్ మంగళవారం మధ్యాహ్నం
వన్ టౌన్ సమారంగం చౌక్లోని ఓ బార్లో అతడు రెండేళ్ల వయసున్న తన కూతురుని రూ. 5,000కు
విక్రయించేందుకు ప్రయత్నం చేశాడు. ఈ విషయం తమకు అందడంతో పోలీసులు సతీష్ను
అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ చిన్నారి ఆలనాపాలనా
చూసుకున్నారు. పాపకు తిండిపెట్టారు. అనంతరం బాలికను చైల్డ్ లైన్ అధికారులకు
పోలీసులు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్
పోలీసులు వెల్లడించారు. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి వుంది.