పవర్ స్టార్ మేనరిజంతో డాన్స్ దుమ్మరేపిన కరోనా సోకిన చిన్నారులు
By: chandrasekar Sat, 25 July 2020 3:23 PM
కరోనా వల్ల మరణాలు రేటు 3 శాతం
కంటే తక్కువైనా ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ సోకిందని భయపడటం
వల్లే ఎందరో మరణిస్తున్నారు. ఇటీవలే కడప జిల్లాకు చెందిన ఓ జర్నలిస్టు కరోనా
సోకడంతో భయపడటం వల్లే మరణించాడనే వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇలాంటి తరుణంలో
అప్పుడప్పుడూ స్ఫూర్తినింపే వార్తలు, విశేషాలు కూడా ప్రజల్లో భరోసా నింపుతున్నాయి. ఇలాంటి
వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా
వైరస్ బారిన పడ్డ ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మస్థైర్యం
ప్రదర్శించారు.
పశ్చిమ గోదావరి
జిల్లాలోని తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్లో కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు
పిల్లలు డాన్సులతో సందడి చేశారు. కరోనా సోకిందని బాధపడకుండా ఎంతో ఆత్మస్థైర్యంతో
చికిత్స పొందుతూ టైంపాస్ కోసం డాన్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన
గబ్బర్ సింగ్, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోని పాటకు జోరుగా డాన్స్
చేశారు. దీంతో అక్కడ ఉన్న మిగతా కరోనా బాధితులు కూడా బాధను మరచి పోయి పిల్లలు చేసిన
సందడిని చూస్తూ ఉండిపోయారు. పవర్ స్టార్ మేనరిజంతో డాన్స్ దుమ్మరేపారు.