అమెరికాలో కీలక విభాగాలపై సైబర్ నేరగాళ్ల దాడి
By: chandrasekar Tue, 15 Dec 2020 10:54 AM
అమెరికాలో కీలక
విభాగాలపై సైబర్ నేరగాళ్ల దాడి చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ కీలక
విభాగాలైన ట్రెజరరీ మరియు వాణిజ్య శాఖకు
చెందిన నేషనల్ టెలీకమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్
విభాగాలపై హ్యాకర్లు దాడి చేసినట్లు
సమాచారం. ఈ దాడికి సంబందించిన వివరాలు అందించడానికి అక్కడ అధికారులు
నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ హ్యాకింగ్ దాడి వెనుక రష్యా ఉన్నట్లు అమెరికన్
అధికారులు అనుమానిస్తున్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ
సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫైర్ ఐ హ్యాకింగ్ మరియు ప్రస్తుతం హ్యాకింగ్ ఘటన
దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడిపై అనేక కోణాల్లో
విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ
హ్యాకింగ్ దాడి వల్ల ఏర్పడే నష్టాన్ని
అరికట్టేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయసెక్యూరిటీ
కౌన్సిల్ ప్రతినిధి జాన్ ఉలియట్ తెలిపారు. దీనిపై వైట్ హౌస్లో సమావేశం ఏర్పాటు
చేసి చర్చించాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. కానీ ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందొ
ఇప్పుడే కచ్చితంగా నిర్దారించలేదు.