బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి సైబరాబాద్ పోలీసుల నోటీసులు
By: chandrasekar Wed, 07 Oct 2020 2:01 PM
సైబరాబాద్ పోలీసులు
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి నోటీసులు జారీ చేశారు. సోమవారం రాత్రి వాహన తనిఖీల్లో
రూ. 40 లక్షలు
పట్టుబడ్డ అంశంలో పోలీసులు ఈ నోటీసులను విడుదల చేశారు.
శామీర్పేట పోలీసులతో కలిసి
సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సోమవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై వాహన
తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా రెండు వాహనాల్లో రూ.40 లక్షలు
తరలిస్తున్న నలుగురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను గుడిమల్కాపూర్కు
చెందిన శ్రీనివాస్ బాబు, బి. ఆంజనేయులు, పి. సురేష్, మహ్మద్ మాజిద్గా గుర్తించారు. విచారణలో రఘనందన్
రావు వ్యక్తిగత సహాయకుడు ఆర్ సంతోష్ బాబు మార్గదర్శకాలను అనుసరించి నగదును
సిద్దిపేటకు తరలిస్తున్నట్లు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో రఘనందన్
రావు, సంతోష్
బాబు విచారణకు హాజరుకావాల్సిందిగా సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును
చేరవేస్తున్నట్లు నిందితులు తెలిపారు.