కారులో హవాలా కరెన్సీ కట్టలు
By: Dimple Wed, 09 Sept 2020 10:04 AM
కారులో హవాలా కరెన్సీ కట్టలు
హవాలా లావాదేవీల ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. స్విఫ్ట్ కారులో ఓ ముఠా హవాలా సొమ్ము తరలిస్తుందన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ బృందం ఆ ముఠాను కాపుకాసి పట్టేసింది. నరసాపురం నుంచి హైదరాబాద్కు హవాలా సొమ్ము తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. ఆ కారులో ఉన్న కోటీ నలభై లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా రూ.24 లక్షలు విలువ చేసే 30వేల డాలర్లు పట్టుకున్నారు. బంగారం వ్యాపారి ప్రవీణ్ జైన్తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మూలాల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద కూపీ లాగుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి హైదరాబాద్కు కారు(ఏపీ37బీడబ్ల్యూ4532)లో తరలిస్తున్న రూ.1.4 కోట్ల హ వాలా సొమ్మును బెజవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమకు అందిన స మాచారంతో గొల్లపూడి బైపాస్వద్ద భవానీపురం పోలీసులు కారును అడ్డగించి తని ఖీ చేయగా.. వెనుక సీటు కింద ఏర్పాటు చేసిన బాక్సులో రూ.1.40 కోట్ల నగదు, 34 వేల విలువైన అమెరికా కరెన్సీని గుర్తించారు. దీనిపై విజయవాడ సీపీ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిందితులు చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబు, వల్లూరి శివనాధ్, ప్రవీణ్ కుమార్ జైన్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.