2021 లో కూడా అతడే మా కెప్టెన్ ...ఆ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్
By: Sankar Tue, 27 Oct 2020 7:59 PM
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్కు దూరమైంది. కెప్టెన్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శనే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధోనీ చేస్తున్న ఓ పని ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మ్యాచ్ అనంతరం తన చెన్నై జెర్సీలను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు బహుమానంగా ఇచ్చేస్తున్నాడు ధోనీ.
ఈ నేపథ్యంలో ధోనీ ఆడే చివరి ఐపీఎల్ ఇదేనని పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై ధోనీ మాత్రం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో అందరి అనుమానాలను, ఆందోళనలను దూరం చేస్తూ సీఎస్కే సీఈవో స్వామినాథన్ ఓ తీపికబురందించారు.
అదేంటంటే 2021లో కూడా ధోనీయే చెన్నై జట్టు కెప్టెన్గా ఉంటారని ఆయన ప్రకటించారు. అయితే జట్టు ఓటమికి సురేశ్ రైనా, హర్భజన్ లేకపోవడం, కోవిడ్ కేసులు వెంటాడటం వంటి ప్రతికూల పరిస్థితులే కారణమని ఆయనన్నారు. ఎప్పుడు ఐపీయల్ అనగానే ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉండే చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం పూర్తిగా తేలిపోయింది..దీనితో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు..