CSK బ్యాట్స్మన్ రాయుడు మరో రెండు మూడు మ్యాచ్లకు దూరం!
By: chandrasekar Thu, 24 Sept 2020 12:47 PM
ఐపీఎల్ 13వ సీజన్లో గాయాల బారిన పడుతున్న ఆటగాళ్ల సంఖ్య
ఎక్కువవుతోంది. తాజాగా చెన్నై సూపర్
కింగ్స్ బ్యాట్స్మన్ అంబటి రాయుడుకు తొడ కండరాలు పట్టేయడంతో మరో రెండు మూడు
మ్యాచ్లకు దూరంగా ఉండబోతున్నాడు.
ప్రస్తుతం అతడు గాయం
నుంచి కోలుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్తో
మ్యాచ్లో అంబటి రాయుడు (71: 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచురీ తో చెలరేగి జట్టుకు
విజయాన్నీ అందించాడు.
దాని వల్ల రాజస్థాన్
రాయల్స్తో మ్యాచ్లోనూ అతడు ఆడలేదు. రాయుడు 100శాతం ఫిట్నెస్ సాధించలేదని
రాజస్థాన్తో మ్యాచ్కు ముందు ధోనీ చెప్పిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్కు కూడా కండరాలు
పట్టేశాయి. బెంగళూరుతో జరిగిన మొదటి
మ్యాచ్లోనూ పాల్గొనలేదు. గాయం కారణంగా ఆ జట్టు
ఆటగాడు మిచెల్ మార్ష్ సీజన్ నుంచి వైదొలిగాడు.