ఖాళీల లెక్కలు వెంటనే తేల్చాలి ...అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
By: Sankar Tue, 15 Dec 2020 12:00 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను వెంటనే తేల్చాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
పోలీస్, ఉపాధ్యాయ, ఇతర విభాగాల్లో 50 వేలకుపైగా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం బీఆర్కే భవన్లో వివిధశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా అన్నిశాఖల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో వేగంగా సమర్పించాలని సూచించారు