కండిషన్ బెయిల్పై ఉన్న వ్యక్తి కోర్టులపై విమర్శలు చేయడం దివాలా కోరుతనం
By: chandrasekar Fri, 18 Sept 2020 6:18 PM
దళిత ఎంపీ దుర్గాప్రసాద్
సంతాప తీర్మానంపై పార్లమెంట్లో చర్చను వైసీపీ బాయ్కాట్ చేయడం నీచమని చంద్రబాబు
అన్నారు. కనీసం దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సీఎం వెళ్లలేదని ఆయన
మండిపడ్డారు.
జీఎస్టీ నిధుల కోసం ప్రతిపక్షాల
ధర్నాలో వైసీపీ ఎంపీలు పాల్గొనకపోవడం గర్హనీయమన్నారు. వైసీపీకి కక్ష సాధింపుపై
ఉన్న శ్రద్ధ, జీఎస్టీ నిధులు రాబట్టడంపై లేదని ఎద్దేవా చేశారు.
కండిషన్ బెయిల్పై ఉన్న
వ్యక్తి కోర్టులపై విమర్శలు చేయడం దివాలా కోరుతనమన్నారు. వైసీపీ తప్పులు చేస్తూ
కోర్టులపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. జడ్జిలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వైసీపీ
దుష్ప్రచారం చేయడం నీచమని వ్యాఖ్యానించారు.
16 నెలల వైసీపీ పాలనలో అవినీతిపై సీబీఐ దర్యాప్తు
కోరాలని సూచించారు. భూసేకరణ, మద్యం, జే ట్యాక్స్, మైనింగ్పై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. అంతర్వేదితో
సహా ఆలయాలన్నింటిపై సీబీఐ దర్యాప్తు కోరాలని చంద్రబాబు కోరారు.