- హోమ్›
- వార్తలు›
- నటి కంగనా రనౌత్పై క్రిమినల్ పరువు నష్టం కేసులో సంక్షిప్త వివరాలు అందించిన జావేద్ అక్తర్
నటి కంగనా రనౌత్పై క్రిమినల్ పరువు నష్టం కేసులో సంక్షిప్త వివరాలు అందించిన జావేద్ అక్తర్
By: chandrasekar Thu, 03 Dec 2020 11:54 PM
ఒక ఇంటర్వ్యూలో తన పరువు
ప్రతిష్టలకు భంగం కలిగించేలా మరియు సుశాంత్ మరణం కేసులో తన పేరును అనవసరంగా
లాగారని జావేద్ అక్తర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. నటి కంగనా రనౌత్పై
క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టిన ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ గురువారం
అంధేరి మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఫిర్యాదు కోసం కోర్టు ఎదుట ధ్రువీకరణ
ఇచ్చేందుకు జావేద్ అక్తర్ కోర్టుకు వచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ
కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి జావేద్ అక్తర్ కోర్టు
ముందు హాజరయ్యారు. అతను తన గుర్తింపు, తన
ఫిర్యాదు గురించి సంక్షిప్త వివరాలను అందించారు.
ఇందుకోసం అతను అందించిన
ధ్రువీకరణ పూర్తయినందున తదుపరి విచారణను అంధేరి కోర్టు డిసెంబర్ 19 కి వాయిదా వేసింది. కంగనా రనౌత్ ఓ న్యూస్ ఛానెల్కు
ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరువు, ప్రతిష్టలకు
భంగం కలిగించేలా ఆరోపణలు చేసిందని, సుశాంత్
సింగ్ రాజ్పుత్ మరణం కేసులో కంగనా రనౌత్ తన పేరును అనవసరంగా లాగారని ఆరోపిస్తూ
జావేద్ అక్తర్ కంగనా రనౌత్పై అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం
కేసు పెట్టారు. కంగనా రనౌత్పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద
పరువు నష్టం కేసు నమోదు చేయాలని అయన కోర్టును కోరారు.
కంగనా సోషల్
మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్కు
న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తరచూ ట్విట్టర్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
వివిధ న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ వీడియో వివిధ ఆన్లైన్
ప్లాట్ఫామ్లపై లక్షల్లో ఆమె వ్యూస్ సంపాదించింది. జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన బాంద్రా ఇంట్లో
చనిపోయాడు. దీనికి సంబంధించి సీబీఐ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికోసం
ఆమె చేసిన ఆరోపణలపై చర్య తీసుకోవాలని అయన కోరారు.