Advertisement

  • ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన క్రైంబ్రాంచ్ పోలీసులు

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన క్రైంబ్రాంచ్ పోలీసులు

By: chandrasekar Thu, 24 Sept 2020 5:32 PM

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన క్రైంబ్రాంచ్ పోలీసులు


క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ఆరుగురిని క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల నుంచి రూ.6 ల‌క్ష‌లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ‌ని జాయింట్ సీపీ సందీప్ పాటిల్ చెప్పారు.

వీరిపై క‌ర్ణాట‌క‌లోని మ‌న‌స్వాడీ, మ‌ల్లేశ్వ‌రంలో రెండు కేసులు న‌మోద‌య్యాయ‌ని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన టోర్నీల్లో ఒక‌టైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ ఈ నెల 19న యూఏఈలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది యూఏఈలో నిర్వ‌హిస్తున్నారు. యూఏఈలోని అబుదాబీ, షార్జా, దుబాయ్ వేదిక‌ల్లో న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌రగనున్నాయి.

Tags :
|
|

Advertisement