Advertisement

హైదరాబాద్ లో బెట్టింగ్ ముఠా అరెస్ట్..

By: Sankar Mon, 05 Oct 2020 9:14 PM

హైదరాబాద్ లో బెట్టింగ్ ముఠా అరెస్ట్..


సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాని అరెస్ట్ అయింది. ఎనిమిది మంది సభ్యుల ముఠాను పట్టుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు 22 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఈ కేసులో 9 మంది పరారీలో ఉన్నారని సీపీ సజ్జానర్ పేర్కొన్నారు. చందూర్ శశాంక్ అనే ప్రధాన బూకీని అరెస్టు చేశామన్న అయన ఇతనితో పాటు మరో ఏడుగురు ఫంటర్స్ ను అరెస్టు చేశామని అన్నారు.

భర్కత్ అనే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడని, ఈ వ్యక్తి మొబైల్ ఫోన్ లోనే ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అన్నారు.బెట్ 365, డ్రీం 11, ఎంపీఎల్, బెట్ వే, డ్రీంగురు, మై 11 సర్కిల్, బెట్ 365, కోరల్, బివిన్, 777 బెట్, డెఫాబెట్ , విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్‌ఫ్రడ్‌, లోటస్ క్రికెట్ లైన్ తదితర మొబైల్ యాప్ ల లో వచ్చే రేటింగ్ లు ద్వారా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

ఎవరికైనా బెట్టింగ్ లకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9490617444 నెంబర్ కు కాల్ చేయండని కోరారు. స్టూడెంట్స్ ఎక్కువగా బెట్టింగ్ లలో పార్టీసిపెట్ చేస్తున్నారని అన్నారు. డబ్బు ఎవ్వరికీ ఊరికే రాదు కష్టపడాలని, రాత్రికి రాత్రే శ్రీమంతుడు అవ్వాలనుకోవటం కరెక్ట్ కాదని బెట్టింగులకు నగర యువత దూరంగా ఉండాలని కోరుతున్నానమని అన్నారు.

Tags :
|

Advertisement