Advertisement

  • మూసాపేట మెట్రో స్టేషన్ గోడకు పగుళ్లు ..ఆందోళనలో ప్రజలు

మూసాపేట మెట్రో స్టేషన్ గోడకు పగుళ్లు ..ఆందోళనలో ప్రజలు

By: Sankar Wed, 16 Sept 2020 6:55 PM

మూసాపేట మెట్రో స్టేషన్ గోడకు పగుళ్లు ..ఆందోళనలో ప్రజలు

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త పెను దుమారం రేపింది.అప్పట్లో మెట్రో స్టేషన్ నాణ్యత మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి..తాజాగా మరొక సంఘటన మెట్రో నాణ్యతను ప్రశ్నించేలా చేస్తుంది..మూసాపేటలోని మెట్రో స్టేషన్‌ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.

మెట్రో స్టేషన్ పగుళ్లకు సంబందించిన కొన్ని చిత్రాలు, అలాగే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఓ మెట్రో రైల్వే స్టేషన్ గోడలకు పగుళ్లు రావడంతో అధికారులు పగుళ్లను నామమాత్రంగా పూడ్చేసారు. అప్పుడు కూడా ప్రయాణికులు మెట్రోస్టేషన్లకు వెళ్లేందుకు ఇదే విధంగా జంకారుదీంతో భాగ్యనగరవాసులు, మెట్రో ప్రయాణికులు అటు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ ఏ గోడ కూలి మీద పడుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెట్రో నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇటీవలే ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో సర్వీసుల్ని అధికారులు ప్రారంభించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. సరైన నిర్వహణ లోపం వల్లే ఈ పగుళ్లు ఏర్పడ్డాయని పలువురు భావిస్తున్నారు. త్వరగా అధికారులు స్పందించి ఈ పగుళ్లను సరిచేయాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు. లేకపోతే అనుకోని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు

Tags :
|
|

Advertisement