Advertisement

  • తెలంగాణాలో టపాసులపై నిషేధం విధించిన హై కోర్ట్

తెలంగాణాలో టపాసులపై నిషేధం విధించిన హై కోర్ట్

By: Sankar Thu, 12 Nov 2020 3:49 PM

తెలంగాణాలో టపాసులపై నిషేధం విధించిన హై కోర్ట్


తెలంగాణలో టపాసుల బ్యాన్‌పై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టపాసులు ఖచ్చితంగా నిషేధించి తీరాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది.

ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని, కొనడం గాని చేయవద్దని ఆదేశించింది. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ పెరుగుతున్న నేపథ్యంలో క్రాకర్స్‌ బ్యాన్‌ చేయాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

టపాసుల కారణంగానే శ్వాస కోశ ఇబ్బందులు పడుతారన్న ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులపై బ్యాన్‌ విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి ఇదివరకే పలు రాష్ట్రాలు టపాసులపై నిషేధం విధిస్తున్న విషయ తెలిసిందే. దేశ రాజధానితో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్‌ బ్యాన్‌ చేశారు.

Tags :
|

Advertisement