Advertisement

  • తక్కువ ఓటింగ్ నమోదు అవ్వడంపై సీరియస్ అయిన సీపీ సజ్జనార్

తక్కువ ఓటింగ్ నమోదు అవ్వడంపై సీరియస్ అయిన సీపీ సజ్జనార్

By: Sankar Tue, 01 Dec 2020 9:49 PM

తక్కువ ఓటింగ్ నమోదు అవ్వడంపై సీరియస్ అయిన సీపీ సజ్జనార్


గ్రేటర్‌ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదు కావడం బాధాకరమిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఓటు హక్కుపై ఎన్నికల కమిషన్‌ మరింత అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి అని సూచించారు. ఓటు వేసిన వ్యక్తులకే ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలన్నారు. అలాగే ఓటేయని వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటేనే ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా గత రెండు ఎన్నికల కంటే ఈ సారి అత్యంత తక్కువగా ఓటింగ్ నమోదు అయింది..సినిమా స్టార్స్ తో ప్రచారం చేయించిన కూడా నగర ప్రజలు ఓట్ వేసేందుకు ఆసక్తి చేయించలేదు..అయితే ఈ సారి కరోనా ఉండటం కూడా వోటింగ్ తగ్గడానికి ఒక మెయిన్ కారణం ...గ్రేటర్ లో కరోనా కేసులు ఎక్కువ ఉండటంతో ప్రజలు ఓట్ వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూయించలేదు..

Tags :
|

Advertisement