Advertisement

  • జనవరిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్... విజయవంతంగా మూడవ దశ ప్రయోగాలు...

జనవరిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్... విజయవంతంగా మూడవ దశ ప్రయోగాలు...

By: chandrasekar Thu, 05 Nov 2020 10:23 AM

జనవరిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్... విజయవంతంగా  మూడవ దశ ప్రయోగాలు...


కరోనాని కట్టడి చేయడానికి ఇంతవరకు వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. మరోవైపు కరోనా వైరస్ సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీ లో భయాందోళన కలిగిస్తుంది. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒక శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఇండియాలో కరోనా వైరస్ సంక్రమణ భయం తొలగకముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు సెకండ్ వేవ్ గురించి భయపడుతున్న తరుణంలో ఏకంగా థర్డ్ వేవ్ ప్రవేశించిందని చెప్పడం నిజంగానే ఆందోళన కల్గించే పరిణామం. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్నటువంటి సీరమ్ ఇనిస్టిట్యూట్ సంస్థ ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాల్ని ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తోంది. ఇండియాలో కోవిషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్ తయారుకానుంది. ఇండియాలో 17 నగరాల్లో 16 వందలమంది వాలంటీర్లపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగం జరుగుతోంది. ఫేజ్ 2, 3 ప్రయోగాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ప్రయోగాలు సక్సెస్ అంటూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అధార్ పూణావాలా తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ ను వచ్చే యేడాది జనవరిలో అందుబాటులో వస్తుందని స్పష్టం చేశారు. ప్రజల కోసం సురక్షితమైన, సమర్ధవంతమైన వ్యాక్సిన్ అందిస్తామన్నారు. తొలిదశలో 7 కోట్ల డోసులు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ సహా బ్రిటన్ లో ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయినప్పటికీ, ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సకాలంలో అనుమతి రావల్సి ఉందన్నారు. తొలి దశలో నెలకు 6 నుంచి 7 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని, తదుపరి దశలో పది కోట్లకు పెంచుతామని తెలిపారు. త్వరగా అందుబాటులోకి వస్తే కరోనా నుండి బయట పడవచ్చు.

Tags :

Advertisement