క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన భార్యాభర్త
By: Sankar Thu, 06 Aug 2020 12:14 PM
తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలు క్వారంటైన్ సెంటర్ నుంచి పరారై వచ్చారు. కాలనీలోకి వచ్చిన భార్యాభర్తలిద్దరూ రోడ్డు మీద సంచరించడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలోనూ వీరు ఇదే విధంగా పారిపోయి వచ్చారని గుర్తించి వారిని ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు.
రెండురోజుల క్రితం గుండిమెడ క్వారంటైన్ నుంచి పారిపోయి రాగా తాడేపల్లి మున్సిపల్ అధికారులు, వైద్యులు డాక్టర్ కిరణ్కుమార్ భార్యాభర్తలిద్దరినీ గుంటూరులోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. తిరిగి మరలా వారు పారిపోయి రావడంతో ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంచి, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని తిరిగి మరలా క్వారంటైన్కు తరలిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు.
కాగా ఏపీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి ..గత కొద్దీ రోజులుగా పదివేలలోపు నమోదు అయినప్పటికీ తిరిగి గత 24 గంటల్లో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి ..ఈస్ట్ గోదావరి , కర్నూలు , అనంతపురం , విశాఖపట్నం , గుంటూరు లలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి