Advertisement

  • ఏపీలో కోరలు చాస్తున్న కరోనా - ఒకే రోజు పదివేలమందికి పాజిటివ్

ఏపీలో కోరలు చాస్తున్న కరోనా - ఒకే రోజు పదివేలమందికి పాజిటివ్

By: Dimple Sat, 08 Aug 2020 10:01 AM

ఏపీలో కోరలు చాస్తున్న కరోనా - ఒకే రోజు పదివేలమందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా కోరలు చాస్తోంది. నానాటికీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 10171 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్త 23 లక్షల62 వేల 270 మందిని పరీక్షిస్తే 2,06,960 మందికి కోవిడ్‌ పాజిటివ్ అని తేలింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా వివరాలను వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,20,464 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 62,938 నమూనాలు పరీక్షిస్తే పదివేలమందికి పై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ఒకే రోజు కరోనాతో 89 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో పది మంది; అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; తూర్పు గోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు; కృష్ణా జిల్లాలో ఆరుగురు; కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు; శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనా వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,842కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 1,331 కేసులు, తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,270 కేసులు, అనంతపురం జిల్లా నుంచి 1,100 కేసులు వచ్చాయి.

Tags :
|
|
|
|
|
|

Advertisement