ఆసుపత్రి నుంచి తప్పించుకోవాలని చూసింది ..కానీ ప్రాణాలను కోల్పోయింది
By: Sankar Thu, 20 Aug 2020 7:59 PM
కరోనా మహమ్మారి వచ్చిన దానికంటే ఆ భయానికి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు..కరోనా వస్తే కుటుంబానికి దూరంగా ఉండాల్సిరావడంతో చాలా మంది తట్టుకోలేకపోతున్నారు .మరికొంత మందుఅయితే ఎవరు లేని సమయంలో ఆసుపత్రి నుంచి పారిపోతున్నారు..హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేక అక్కడి నుంచి పారిపోవడానికి చాలామంది ప్రయత్నించారు.
కొంతమంది అయితే హాస్పిటల్లో ఉండడం కన్నా ప్రాణాలు పోగొట్టుకోవడం బెటర్ అని బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాపం.. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లోని టీఎంయూలో కొవిడ్ హాస్పిటల్ నుంచి కరోనా వచ్చిన ఓ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది.
28 ఏండ్ల మహిళకు ఈ మధ్యనే కరోనా వచ్చి హాస్పిటల్లో చేరింది. ఆమెకు హాస్పిటల్లో ఉండటం ఇష్టం లేదు. ఎంత చెప్పినా వైద్య సిబ్బంది పంపించకపోవడంతో ఎవరూ లేని సమయంలో హాస్పిటల్ వెనుకభాగం కిటికీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ అదుపు తప్పడంతో కాలు జారి కింద పడిపోయింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఆత్మహత్య చేసుకుంది అనుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో ఆధారంగా అసలు విషయం బయటపడింది